జాతీయ వార్తలు
కులాల వివక్షను రూపుమాపినప్పుడే దేశం అభివృద్ధి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 September 2019
తిరువనంతపురం, సెప్టెంబర్ 21: సమాజంలో కుల వివక్షను రూపుమాపినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర పునరుత్పాదక శక్తి సహాయ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. ఇక్కడి వరకాల శివగిరి మఠ్, అథ్యాత్మిక గురువు, సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురు 92వ సమాధి రోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మంత్రి ఆర్కే సింగ్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సింగ్ ప్రసంగిస్తూ సమాజంలో కుల వివక్షను పారదోలాల్సి ఉందన్నారు. కుల వివక్ష ఉన్నంత కాలం దేశం అభివృద్ధి చెందదని ఆయన తెలిపారు.