జాతీయ వార్తలు

కమలేష్ కుటుంబానికి సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 23: ఇటీవల దారుణ హత్యకు గురైన బీజేపీ కార్యకర్త కమలేష్ తివారీ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మృతుడి భార్యకు 15 లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని తక్షణమే అందజేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సీతాపూర్ జిల్లా మహమూదాబాద్ పరిధిలో గత వారం జరిగిన దాడిలో కమలేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. 45 ఏళ్ల తివారీ హత్య కేసులో గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఇప్పటికే అశ్వక్ షేక్ (34), మొయినుద్దీన్ (27)ను అరెస్టు చేశారు. కాగా, తివారీ హత్య సంఘటనతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, సత్వరమే విచారణను పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆదేశించారు. బాధితులకు కఠిన శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు.