జాతీయ వార్తలు

‘సరి-బేసి’ని అవసరమైతే పొడిగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ‘ఎమర్జన్సీ’ స్థాయికి చేరుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విధించిన ‘సరి - బేసి’ విధానాన్ని అవసరమైతే మరికొంతకాలం పొడిగిస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బుధవారం స్పష్టం చేశారు. వాహనాల నుంచి వెలువడే కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఈనెల నాలుగో తేదీ నుంచి ఢిల్లీలో అమలుచేస్తున్న సరి-బేసి విధానం ఈనెల 15వ తేదీతో ముగియనుంది. దీనిని అవసరమైతే వాయు కాలుష్య తీవ్రతను బట్టి మరికొంతకాలం పొడిగిస్తామని విలేఖరుల అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేజ్రీవాల్ వివరించారు. పొరుగు రాష్ట్రాల్లో పంటలను దగ్ధం చేయడం ద్వారా వెలువడుతున్న వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా దెబ్బతిందని సీఎం పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల కారణంగా ఢిల్లీలో కాలుష్య తీవ్రత ‘ఎమర్జన్సీ’ స్థాయికి చేరుకొందని ఆందోళన వ్యక్తం చేశారు.