జాతీయ వార్తలు

20కిలోల బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఢిల్లీలోని ఓ వ్యాపారి నుంచి రెవిన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ భారీ ఎత్తున బంగారం, నగదు ఆదివారం స్వాధీనం చేసుకుంది. దాదాపు 20.64కిలోల బంగారం, రూ.6.44కోట్ల నగదును డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 995శుద్ధి కలిగిన మార్కు ఉన్న 20 బంగారు కడ్డీలు ఈ వ్యాపారి దగ్గర లభించాయని అధికారులు తెలిపారు. సదరు వ్యాపారిని అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. గత నెల రోజుల్లో మొత్తం 7వేల కిలోగ్రాముల బంగారం ఒక్క ఢిల్లీలోనే పట్టుబడింది. దీని విలువ సుమారు రెండు వేల కోట్లరూపాయలైనా ఉంటుంది. అయితే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని, విదేశీమారక నియంత్రణ, అక్రమ రవాణా నిరోధ చట్టం కింద కేసు నమోదుచేసినట్లు అధికారులు వెల్లడించారు.