జాతీయ వార్తలు

సరిహద్దుల్లో పాక్ కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, అక్టోబర్ 16: జమ్ము కాశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనల పరంపర ఆగటం లేదు. రాజోరీ జిల్లాలో ఆదివారం పాకిస్తాన్ సైన్యం ఎలాంటి హెచ్చరికలు లేకుండా జరిపిన కాల్పుల్లో భారత జవాను ఒకరు వీరమరణం పొందారు. గోవాలో బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో రష్యా, చైనా దేశాధినేతలు భారత్‌లో చర్చలు జరుపుతున్న సమయంలోనే పాక్ దుందుడుకుగా వ్యవహరించటం గమనార్హం.
రాజోరీలోని తార్కుండి బెల్ట్‌లో ఆదివారం తెల్లవారుజామునే పాక్ కాల్పులకు తెగబడిందని, డిఫెన్స్ పిఆర్‌ఓ పేర్కొన్నారు. సెప్టెంబర్ 29నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ 25సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది.