జాతీయ వార్తలు

మీరంతా ‘నకిలీ గాంధీ’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 15: మీ కుటుంబ సభ్యులందరూ ‘నకిలీ గాంధీ’లు అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై మండిపడ్డారు. దేశ భక్తుడు, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీర సావర్కర్ గురించి రాహుల్ గాంధీ చిల్లర వ్యాఖ్యలు చేశారని ఆయన ఆదివారం హుబ్లీలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్‌తో పాటు లౌకిక పార్టీలుగా చెప్పుకునే పలు పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ పార్టీలు పౌరసత్వ బిల్లును హిందు-ముస్లింలకు సంబంధించిన అంశంగా చూపించి దేశంలో అశాంతి సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. థాక్రేనుద్ధేశించి రాహుల్ గాంధీ ఎటువంటి వ్యాఖ్యలు చేశారో, ఇప్పుడు ఏమి చేస్తున్నారో దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ‘మీరు ఏమి కావాలనుకుంటున్నారో కండి, మాకేమీ అభ్యంతరం లేదు, కానీ దేశ భక్తుడైన వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి చేసిన వ్యాఖ్యలు మీ అసహానాన్ని తెలియజేస్తున్నాయి..’ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాహుల్‌ను విమర్శించారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వీరంతా నకిలీ ‘గాంధీ’లేనని ఆయన విమర్శించారు.