జాతీయ వార్తలు

లారీని ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టంగుటూరు, ఏప్రిల్ 14: పుణ్య క్షేత్రాల సందర్శన చేస్తున్న భక్త బృందం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గురువారం చైనె్న నుండి విజయవాడ వైపు వెళుతున్న 7 డబ్ల్యూ 47వై 9399 నెంబరు గల కారు టోల్‌ప్లాజా వద్దకు రాగానే ముందుగా వెళుతున్న లారీని వెనుకనుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన వరదరాజన్ (50), సతీశ్ (35), సుబ్రహ్మణ్యం (45), సత్యమూర్తి (47) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శ్రీ రామనవమి సందర్భంగా భద్రాచలం, శ్రీశైలం పుణ్య క్షేత్రాలను సందర్శించేందుకు బయలుదేరారు. కారు నెంబర్, సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా మృతులు తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఒంగోలు డిఎస్‌పి జి శ్రీనివాసరావు, శింగరాయకొండ ఎస్‌ఐ భీమానాయక్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను టంగుటూరు ఎస్‌ఐ ఎంవియస్ శివకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐ శివకుమార్ ఆధ్వర్యంలో తక్షణ చర్యలు చేపట్టి మృతదేహాలను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

chitram టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద లారీని ఢీకొన్న కారు.