జాతీయ వార్తలు

యూపీలో కమలవికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖేరీ, ఫిబ్రవరి 3: ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసం ఖాయమని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోస్యం చెప్పారు.ఎస్‌పి, బిఎస్‌పిల సృష్టించిన రాజకీయ బురదలోంచి బిజెపి ఎన్నికల గుర్తు కమలం వికసిస్తుందని శుక్రవారం కస్తావా నియోజకవర్గ ఎన్నికల సభలో ధీమా వ్యక్తం చేశారు. బిజెపి అభ్యర్థి సురభ్ సింగ్ సోనూకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. 30 నిముషాల ఎన్నికల ప్రసంగంలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీని ఉతికారేశారు.ఎస్‌పి, కాంగ్రెస్ పొత్తును అనైతికమైందని రాజ్‌నాథ్ దుయ్యబట్టారు.‘ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకిస్తే కుమారుడు అఖిలేశ్ యాదవ్ కలిసిపోటీకే సిద్ధపడ్డారు’అని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల గుర్తు సైకిల్ దూసుకెళ్లాలంటే సమర్ధులను ఆశ్రయించాలి తప్ప పంక్చర్ పెట్టేవాళ్లతో కలుస్తారా అంటూ కాంగ్రెస్‌తో పొత్తుపై నిలదీశారు. కుటుంబ సమస్యతలో సతమతమయ్యే పార్టీ రాష్ట్రానికి ఏం చేస్తుందని అన్నారు. అనైతిక పొత్తుల వల్ల ఒనగూరేది ఏమీ లేదని హోమ్‌మంత్రి చెప్పారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఓ కాంగ్రెసేతర పార్టీ మంచి మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారాన్ని చేపట్టిందని, ఈరెండున్నర ఏళ్లలో దేశ ప్రతిష్టను పెంచిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. మోదీ కేబినెట్‌లోని కళంకిత మంత్రి ఉన్నారని ప్రతిపక్షాలు వేలెత్తిచూపే పరిస్థితులు లేవని ఆయన చెప్పారు.