జాతీయ వార్తలు

తెలంగాణలో డ్రై పోర్టుకు ప్రతిపాదనలు రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6:తెలంగాణలో డ్రై పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలేవీ అందలేదని కేంద్ర నౌకాయాన మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు మహ్మద్ అలీ ఖాన్ సోమవారం అడిగిన ప్రశ్నకు సదరు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా ఈ విషయం తెలిపారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అధ్యర్యంలో డ్రై పోర్టు ఏర్పాటుకు నోటిషికేషన్ విడుదల చేసినట్టు తెలిపారు. అలాగే తెలంగాణలో 15, ఏపిలో 33 ప్రాజెక్టులు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి అనిల్ మాధవ్ దవే వెల్లడించారు. అలాగే ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా తెలంగాణ, ఏపీలో పరిశ్రమల అభివృద్ధి ప్రోత్సాహానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.