జాతీయ వార్తలు

ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని లోక్‌సభలో టీడీపీ పక్షనేత తోట నర్సింహం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా తోట నర్సింహం సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. విభజనవల్ల ఏర్పడిన రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేయాలని కోరారు. అలాగే విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కాకినాడ-కోటిపల్లి- నర్సాపూరం రైల్వేలైన్‌కు 130 కోట్లు కేటాయించినందుకు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.
జవడేకర్ కుమారుడి పెళ్లి విందులో కెసిఆర్, బాబు
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ కుమారుడి పెళ్లి విందుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రులిరువురూ ఈ పెళ్లి విందులో పాల్గొనేందుకే ప్రత్యేకంగా ఢిల్లీకి వచ్చారు. చంద్రబాబు విందు ముగిసిన వెంటనే విజయవాడకు వెళ్లిపోయారు. ఆదివారం రాత్రే ఢిల్లీ వచ్చిన కెసిఆర్, మంగళవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నట్టు సమాచారం.