జాతీయ వార్తలు

అరుణాచల్ విద్యార్థిపై బెంగళూరులో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 13: బెంగళూరులో నివాసం ఉంటున్న అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిపై ఇంటి యజమాని దారుణంగా ప్రవర్తించాడు. హిగియో గుంగ్తే (22) చదువుకోవడానికి అరుణాచల్‌ప్రదేశ్ నుంచి బెంగళూరు వచ్చి నివాసం ఉంటున్నాడు. నీటి కొరత తీవ్రంగా ఉండటంతో తక్కువగా నీటిని వినియోగించాలని అద్దెకు ఉంటున్న వారిని యజమాని కోరాడు. అయితే గుంగ్తే ఎక్కువ నీటిని వృథా చేస్తున్నాడంటూ పట్టరాని కోపంతో అతనిపై దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు. తన బూట్లు నాకాలని కూడా ఒత్తిడి చేశాడు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెణ్ రిజిజు స్పందించారు. తన కార్యాలయం ఈ ఘటనపై విచారణ జరుపుతోందని పేర్కొన్నారు.