జాతీయ వార్తలు

మన బాధ్యత పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్, మార్చి 26: అధికారంతోపాటు అంతకుమించిన స్థాయిలోనే బాధ్యత కూడా ఉంటుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బిజెపి కార్యకర్తలు అలాగే ప్రజా ప్రతినిధులు కాంట్రాక్టు పనులకోసం పాకులాడకూడదని, అప్పగించిన పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించాలని సూచించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ప్రజలు అనూహ్య మెజారిటీని కట్టబెట్టడం వల్ల దాని బాధ్యత కూడా మరింతగా పెరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి విజయానికి బలమైన పునాదులు వేసింది ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తుందన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలు బిజెపికి పట్టంకట్టారని, ఆ బాధ్యతను త్రికరణశుద్ధిగా నెరవేర్చాల్సిన అవసరం మరింతగా పెరిగిందని చెప్పారు.