జాతీయ వార్తలు
వసల నరసయ్యకు బాల పురస్కార్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 June 2017
న్యూఢిల్లీ, జూన్ 22: బాల పురస్కార్ అవార్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి వసల నరసయ్య ఎంపికయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2017 సంవత్సరానికి బాల సాహిత్యం, యువ పురస్కారాలను గువాహటిలో అకాడమీ చైర్మన్ విశ్వనాథ్ ప్రసాద్ తివారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 24 భాషల్లో అవార్డులను ప్రకటించారు. బాల సాహిత్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రచనలు చేయడంవల్ల ఈ అవార్డుకు వసల నరసయ్య ఎంపికయ్యారు. అలాగే యువ పురస్కార్కు తెలుగు భాషనుంచి మెర్సీ మార్గరేట్ రచించిన ‘మాటాల మడుగు’ కవిత్వానికి అవార్డు లభించింది.
నవంబర్ 14న జరగనున్న సాహిత్య అకాడమీ కార్యక్రమంలో ఈ అవార్డులను అందజయడంతోపాటు రూ.50వేలు నగదును ప్రదానం చేయనున్నారు.