జాతీయ వార్తలు

కాశ్మీరుపై మళ్లీ ఉగ్రపంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 24: కాశ్మీరులో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. శ్రీనగర్‌లో శనివారం సాయంత్రం సిఆర్‌పిఎఫ్ వాహనంపై కాల్పులకు తెగడి ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు మరో ఇద్దరు జవాన్లను గాయపర్చారు. దీంతో తాము ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు సిఆర్‌పిఎఫ్ ఐజి రవిదీప్ సాహి తెలిపారు. ఉగ్రవాదులు శనివారం సాయంత్రం దాదాపు 5.50 గంటల ప్రాంతంలో శ్రీనగర్‌లోని పంత్ చౌక్ బైపాస్ సమీపాన సిఆర్‌పిఎఫ్ 29వ బెటాలియన్‌కు చెందిన బృందంపై కాల్పులకు తెగబడటంతో జవాన్లు ఎదురు కాల్పులకు దిగారని, అయితే మార్కెట్‌కు సమీపంలోని ఆ ప్రాంతంలో ఎప్పుడూ ఉండే రద్దీని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయారని ఆయన వివరించారు. సిఆర్‌పిఎఫ్ బృందంపై దాడి జరిగిందన్న సమాచారం తెలిసిన వెంటనే మరిన్ని భద్రతా బలగాలు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు మొదలు పెట్టాయని రవిదీప్ సాహి తెలిపారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు.