జాతీయ వార్తలు
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జూన్ 25: ఎన్డిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో బిజెవైఎం జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ నుంచి బిజెవైఎం కార్యదర్శి మైపాల్రెడ్డి, క్రీడా విభాగం సభ్యుడు తులపల్లి రవికుమార్, ఏపీనుంచి బిజెవైఎం కార్యవర్గ సభ్యులు అడారి కిషోర్ కుమార్, రమేష్ నాయుడు హాజరయ్యారు.
ఈ సమావేశంలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని 133 రోజులుగా క్రమం తప్పకుండా నిర్విరామంగా ప్రచారం చేస్తున్న అడారి కిషోర్ కుమార్ చేస్తున్న కృషిని బిజెవైఎం జాతీయ కార్యవర్గం అభినందించింది. పూనమ్ మహాజన్ మాట్లాడుతూ పార్టీని గ్రామీణ, మండల స్థాయిల్లో మరింత బలోపేతం చేసే విధంగా కమిటీలను ఏర్పాటుచేయాలని పిలువునిచ్చారు.