జాతీయ వార్తలు
నన్ను ప్రజల్లోనే ఉండనివ్వండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 28 June 2017
న్యూఢిల్లీ, జూన్ 27: రాజ్యాంగ పదవులపై తనకెప్పుడూ ఆసక్తి లేదని, అవి తనను ప్రజలనుంచి దూరం చేస్తాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఎవరు బలవంతం చేసినా ఉపరాష్టప్రతి పదవికి తాను పోటీచేయబోనని పునరుద్ఘాటించారు. ప్రజలను కలవడం, వారికి సేవ చేయడమే తనకు సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ‘ఎవరు ఎలాంటి ఒత్తిడి చేసినా ఉపరాష్టప్రతి ఎన్నికల్లో పోటీచేయన’ని వెంకయ్య స్పష్టం చేశారు. ప్రజలతో మమేకం కావడం తనకెంతో ఇష్టమని, వారికి దూరంగా ఉండలేనని మంగళవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. నేను అనుకున్నది మాట్లాడటం, వివిధ ప్రదేశాలు తిరగడం, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం, వారి ఆహారం తినడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు.