జాతీయ వార్తలు

నిరాహార దీక్ష విరమించిన కన్హయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ తొమ్మిది రోజులుగా సాగిస్తున్న తన నిరాహార దీక్షను శనివారం విరమించుకున్నారు. కొద్ది రోజుల క్రితం యూనివర్సిటీ క్యాంపస్‌లో దేశ వ్యతిరేక నినాదాలు చేయడానికి సంబంధించి యూనివర్సిటీ తమకు విధించిన శిక్షలకు నిరసనగా కన్హయ్యతోపాటుగా 20 మంది విద్యార్థులు గత వారం రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నిరాహారదీక్ష కారణంగా ఆరోగ్యం విషమించడంతో కన్హయ్య కుమార్‌ను శుక్రవారం రాత్రి అధికారులు ఢిల్లీలోని అఖిల భారత వైద్యశాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్)లో చేర్చారు. కన్హయ్యను ఎయిమ్స్‌నుంచి డిశ్చార్జి చేశారని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయన నిరాహార దీక్ష విరమించారని, అయితే ఆందోళనను మాత్రం కొనసాగిస్తారని జెఎన్‌యు విద్యార్థి సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది.