జాతీయ వార్తలు

ఉదారంగు జాకెట్‌తో వస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: రాజ్యసభ కార్యకలాపాల్లో అధికార, ప్రధాన విపక్షాలకు తప్ప మిగతా పార్టీలకు గుర్తింపు లేకుండా పోతోందని సమాజ్‌వాదీ సభ్యురాలు జయాబచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టప్రతి పాలన అమల్లో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన బిల్లుపై అధికార బీజేపీ, ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ల మధ్య పెద్దఎత్తున నినాదాలు.. వాగ్యుద్ధం జరుగుతున్న సమయంలో జయాబచ్చన్ తీవ్రంగా స్పందించారు. డిప్యూటీ చైర్మన్ వీజే కురియన్ సభను నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నిస్తుండగా జయ జోక్యం చేసుకున్నారు. డిప్యూటీ చైర్మన్ తమను గుర్తించాలంటే బుధవారం తాను ఉదారంగు జాకెట్ ధరించి వస్తానని అన్నారు. ‘‘సర్, మీరు సీతారాం ఏచూరీతో మాట్లాడటంలో బిజీగా ఉన్నారు. కాస్త నా మాట కూడా వినండి.. మిగతా పార్టీల సభ్యులను పట్టించుకోకపోవటం సమంజసం కాదు. వాళ్లు సభలో నినాదాలు చేయరు. కార్యకలాపాలను అడ్డుకోరు.. అందువల్లే మీరు వారిని గుర్తించటం లేదు. రేపు నేను ఉదారంగు జాకెట్ ధరించి వస్తా. అప్పుడైనా నన్ను మీరు గుర్తిస్తారని ఆశిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.