జాతీయ వార్తలు

ఉప రాష్టప్రతి వెంకయ్యకు స్వల్ప అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారత ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శుక్రవారం స్వల్ప అస్వస్థతకు కారణంగా ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో చేరారు. వెంకయ్యనాయుడు శుక్రవారం మధ్యాహ్నం రెగ్యులర్ పరిశీలనల కోసం ఎయిమ్స్‌కు వెళ్లారు. వైద్యుల పరీక్షల్లో ఆయనకు సుగర్ లెవెన్స్‌తోపాటు రక్తపుపోటు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. వైద్యుల పరీక్షల అనంతరం ఆయనను ప్రత్యేక వార్డుకు తరలించారు. ఉప రాష్టప్రతిని వివిధ పరీక్షల నిమిత్తం శనివారం వరకు ఎయిమ్స్‌లో ఉండవలసి వస్తుందని వైద్యులు చెప్పారు. వెంకయ్యనాయుడుకు అలసట వల్ల రక్తపోటు, సుగర్ లెవెల్స్ పెరిగాయని తెలిపారు.