జాతీయ వార్తలు

గుజరాత్‌లో మాదే గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, డిసెంబర్ 13: గుజరాత్‌లో అధికార బీజేపీ తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయడానికి విచ్చలవిడిగా డబ్బు, మనుషులను వాడుకుందని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముగిసిన తరువాత గుజరాతీ న్యూస్‌చానల్స్‌తో రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందని చెప్పారు. తమ పార్టీకి జబర్దస్ ఫలితాలొస్తాయని ఆయన ప్రకటించారు. ‘మేం మెజారిటీ చెప్పడం లేదు. ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. అవేమిటో చూస్తారు’ అంటూ ధీమాగా చెప్పారు. తాము వాస్తవాలే మాట్లాడతామని, ఫలితాలు కూడా అలాగే ఉంటాయని రాహుల్ స్పష్టం చేశారు. ‘అధికార బీజేపీ ఎన్ని విధాల దుష్ప్రచారం చేయాలో అన్ని విధాలా చేసింది. డబ్బును వరదలా పారించారు. మనుషులను వాడుకున్నారు’ అని ఆరోపించారు. ‘నేను వాస్తవికవాదిని. వాస్తవానే్న నమ్ముతాను. దానే్న ఆచరిస్తాను’ అని ఉద్ఘాటించారు. నిజాలు వారికి రుచించవని అవి ఏలా ఉంటాయో త్వరలోనే తెలుస్తుందని అధికార పార్టీని ఉద్దేశించి అన్నారు. ఆలయాల సందర్శనపై అడిగిన ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ‘ ఆలయాలను సందర్శించకూడదని నిషేధం ఏదైనా ఉందా? ఆలయాలను సందర్శించుకోవాలని భావించాను..వెళ్లాను’అని ఆయన తెలిపారు.