జాతీయ వార్తలు

13 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఒక బస్సు లోయలో పడిపోయిన సంఘటనలో 13 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. బస్సు అల్మోరా జిల్లా హెడ్‌క్వార్టర్‌కు 120 కి.మీ దూరంలోని పోటమ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైందని జిల్లా మేజిస్ట్రేట్ ఇవా ఆశిశ్ శ్రీవాత్సవ విలేఖరులకు తెలిపారు. మరణించినవారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడని, గాయపడ్డ 12 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో రామ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొనే పరిస్థితి నుంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నంలో బస్సు లోయలో పడిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన తెలిపారు.