జాతీయ వార్తలు

ఉప రాష్టప్రతి విందు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: రాజ్యసభ పనె్నండు రోజుల నుండి ప్రతిష్టంభనకు గురవుతున్నందుకు కలత చెందిన రాజ్యసభ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు రాజ్యసభ సభ్యులకోసం బుధవారం ఏర్పాటుచేసిన విందు కార్యక్రమాన్ని రద్దు చేశారు. సభ్యులకు విందు ఇవ్వాలని వెంకయ్య గత వారం నిర్ణయించటంతోపాటు ప్రధాన మంత్రి, రాజ్యసభ నాయకుడు, ప్రతిపక్షం నాయకుడు, ఇతర ఫ్లోర్ లీడర్లతో చర్చించి విందు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాజ్యసభలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోగానే సభ్యులందరికీ ఆహ్వాన పత్రాలను పంపించాలనుకున్నారు.
అయితే రెండు వారాల గడచినా రాజ్యసభలో సాధారణ పరిస్థితులు నెలకొనకపోవటంతో వెంకయ్య నాయుడు మంగళవారం ఉదయం వివిధ పక్షాల నాయకులతో జరిపిన సమావేశంలో తమ బాధను వ్యక్తం చేయటంతోపాటు బుధవారం నాటి విందును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ సభ్యులకు ఏపీకి సంబంధించిన ప్రత్యేక వంటకాలను రుచి చూపించేందుకు అక్కడినుంచి వంటవారిని రప్పించాలనుకున్నారు. రాజ్యసభ సజావుగా జరగనందుకు కలత చెందిన వెంకయ్యనాయుడు గత వారం పార్లమెంటు సభ్యుల బ్యాడ్‌మింటన్ పోటీలను ప్రారంభించేందుకు కూడా నిరాకరించారు.