జాతీయ వార్తలు

కరణ్ థాపర్‌కు జీకే రెడ్డి అవార్డు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: ప్రముఖ పాత్రికేయుడు, ఐటీవీ అధ్యక్షుడు కరణ్‌థాపర్‌ను జీకే రెడ్డి మెమోరియల్ అవార్డుతో సత్కరించారు. మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ రాజధాని ఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్‌లోని నెహ్రు మెమోరియల్ గ్రంథాలయంలో కరణ్‌థాపర్‌కు ఈ అవార్డును బహూకరించారు. రాజ్యసభ సభ్యుడు, జేకే రెడ్డి, టీఎస్‌ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు టి.సుబ్బిరామిరెడ్డి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జీకే రెడ్డి మెమోరియల్ అవార్డు కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ కరణ్‌సింగ్, రాజ్యసభలో ప్రతిపక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కరణ్‌థాపర్‌కు జీకే రెడ్డి ఆవార్డు కింద ఐదు లక్షల రూపాయల నగదు, బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని మన్మోహన్ అందజేశారు. కరణ్‌థాపర్ జర్నలిస్టుగా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని మన్మోహన్ ప్రశంసించారు. జీకే రెడ్డి అవార్డు ద్వారా జర్నలిజంలో ఉన్నతమైన విలువలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నానని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

చిత్రం..జీకే రెడ్డి మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో వేదికపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సుబ్బిరామిరెడ్డి, కరణ్‌సింగ్, కరణ్‌థాపర్