జాతీయ వార్తలు

రిజర్వేషన్ల బిల్లు సాధించేవరకూ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: తెలంగాణలో రిజర్వేషన్లు సాధించుకునే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. గురువారం టీఆర్‌ఎస్ ఎంపీలు బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీని కలిసి పార్లమెంట్‌లో తాము చేస్తున్న నిరసనల గురించి వివరించారు. అనంతరం ఎంపీ వినోద్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ల్‌ను పెంచుతూ పంపిన బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అంశంపై తాము చేస్తున్న నిరసనలను అద్వానీకి వివరించినట్టు చెప్పారు. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుకొనే వెసులుబాటు కల్పించేందుకు కేంద్రంలోని పెద్దలకు సూచించాలని అద్వానీని కోరినట్టు వెల్లడించారు. విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందని వినోద్‌కుమార్ చెప్పారు.

చిత్రం..రిజర్వేషన్ల అంశంపై గురువారం బీజేపీ సీనియర్ నేత అద్వానీని కలిసిన టీఆర్‌ఎస్ ఎంపీలు