జాతీయ వార్తలు

రాహుల్ ఆచూకీ చెబితే లక్ష రూపాయల రివార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, జూన్ 23: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నదీ చెబితే లక్ష రూపాయల రివార్డు ఇస్తానని మధ్యప్రదేశ్‌కి చెందిన బిజెపి నాయకుడొకరు ప్రకటించారు. ఇటీవలే 46వ ఏట అడుగుపెట్టిన రాహుల్ కొద్ది రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు. అయితే ఆయన ఎక్కడకు వెళ్లారు? ఏ దేశంలో ఉన్నారన్న విష యం గోప్యంగా ఉంచారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి పర్యటనపై ప్రత్యర్థులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తె లిసిందే. అయితే మధ్యప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి విరేంద్ర సింగ్ సిసోడియా ఒకడుగు ముందుకేసి రాహుల్ సమాచారం తెలిపితే అక్షరాల లక్షరూపాయలు రివార్డుగా ఇస్తానని ప్రకటించారు. మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్ చైర్మన్‌గా ఉన్న సిసోడియా‘రాహుల్ ఏ దేశంలో ఉన్నారు? ఆయనకు సంబంధించి సమాచారం ఉంటే ఇవ్వండి. నా జేబులోంచి లక్ష రూపాయలు ఇస్తాను’ అని అన్నారు. కొద్ది నెలల క్రితం రాహుల్ గాంధీ జరిపిన విదేశీ పర్యటనపైనా సెటైర్లు వేశారు. ఆయన తిరిగి స్వదేశం వచ్చేవరకూ ఏ దేశం వెళ్లింది తెలియకుండా రహస్యంగా ఉంచారు. అప్పట్లో ఆయన థాయ్‌లాండ్, మలేసియా, బ్యాంకాక్, సింగపూర్‌లో తిరిగి వచ్చారని బిజెపి నేత తెలిపారు.