జాతీయ వార్తలు

దళితులపై అరాచకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులపై ఉక్కుపాదం మోపుతుందని టీ.కాంగ్రెస్ ఎస్సీ సెల్ వైఎస్ చైర్మన్ గజ్జల కాంతం ఆరోపించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వం పోకడలను అనుసరిస్తూ రాచరిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. దళితులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారిపై ఉక్కుపాదం మోపుతున్నారని దుయ్యబట్టారు. గిట్టుబాటు ధర అడిగిన రైతులను జైల్లో పెడుతున్నారని అన్నా రు. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో ప్రారంభించినవేనని, ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో కేవలం ముడుపుల కోసమే నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తారని గజ్జెల కాంతం పేర్కొన్నారు.