జాతీయ వార్తలు

మొగుడే కాలయముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూన్ 27: భర్తే భార్య పాలిట కాలయముడయ్యాడు. తన ఇద్దరు సోదరులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె నుదుటిపై, చేతిపై పచ్చబొట్లు పొడిచాడు. వివాహ సమయంలో తనకు ఇస్తానన్న వరకట్నం రూ.51వేల రూపాయలు ఇవ్వలేదని ఈ దారుణానికి ఒడిగట్టాడు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో రేని గ్రామానికి చెందిన బాధితురాలు జగన్నాథ్ అనే వ్యక్తిని నిరుడు జనవరిలో వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో బాధితురాలి తల్లిదండ్రులు ఇస్తానన్న వరకట్నం పూర్తిగా ఇవ్వకపోవటంతో ఆమెను చాలాసార్తు కొట్టేవాడని, అప్పటికీ కట్నం చేతికందకపోవటంతో ఇద్దరు సోదరులతో కలిసి ఆమెపై అత్యాచారం చేయటమే కాకుండా నుదుటిపై పచ్చబొట్టు పొడిచాడని మహిళా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అబ్దుల్ వాహిద్ తెలిపారు. పచ్చబొట్టు తొలగించటానికి బాధితురాలి తల్లిదండ్రులు విఫలయత్నం చేశారని, ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోందని ఆయన వెల్లడించారు. నిందితులపై 498(ఏ), 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. కాగా ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ జాతీయ మహిళా కమిషన్‌ను ఆదేశించారు.

చిత్రం బాధితురాలి చేతులపై పచ్చబొట్లు