జాతీయ వార్తలు

క్షమాపణలు చెప్పండి.. లేదంటే ముక్కుచెవులు కోసేస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూన్ 14: రాజ్‌పుట్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మహేశ్వరి ముక్కూ చెవులు కత్తిరిస్తామని శ్రీరాజ్‌పుట్ కర్నిసేన హెచ్చరించింది. బాలీవుడ్ చిత్రం పద్మావత్‌కు నిరసగా కర్నిసేన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఓ బ్యారేజ్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ ‘ఇక్కడ జనాలు వానాకాలం ఎలుకల వలే ఎన్నికలు సమయంలో బొరియల నుంచి బయటకు వస్తారు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు తమను ఉద్దేశించే అన్నారని కర్నిసేన మండిపడుతోంది. తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణలు చెప్పాలని సేన డిమాండ్ చేసింది. లేని పక్షంలో మంత్రి ముక్కూ చెవులు కోస్తామని తీవ్ర హెచ్చరిక చేసింది. కిరణ్ మహేశ్వరి కేబినెట్ ర్యాంక్ మంత్రి. ఉన్నత, సాంకేతిక, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఆమె పనిచేస్తున్నారు. నీటి సమస్యపై మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కాంగ్రెస్ కూడా ఉమామహేశ్వరి ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మహేశ్వరి రాజ్‌సమంద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి క్షమాపణ చెప్పకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని సర్వ్ రాజ్‌పుట్ సమాజ్ సంఘర్ష సమితి వెల్లడించింది. పద్మావత్ హీరోయిన్ దీపికా పదుకోనే ఉదంతం మంత్రి మరిచిపోయినట్టు ఉందని కర్నిసేన పేర్కొంది. రాజస్థాన్‌లో బీజేపీకి రాజ్‌పుట్ ఓటర్లే బలమైన సామాజిక వర్గం.