జాతీయ వార్తలు

‘రైజింగ్ కాశ్మీర్’ ఎడిటర్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 14: రైజింగ్ కాశ్మీర్ ఎడిటర్ ఇన్ చీఫ్ షూజాత్ బుఖారీ గురువారం ఇక్కడ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయారు. దుండగుల కాల్పుల్లో బుఖారీ వ్యక్తిగత భద్రతాధికారి తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ సమీపాన ఉన్న ప్రెస్ కాలనీ వద్దే ఈ దారుణం చోటుచేసుకుంది. బుఖారీపై ఇంతకు ముందూ హత్యాయత్నం జరిగింది. 2000 సంవత్సరంలో ఆయనపై దాడి జరిగింది. దీంతో పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. సీనియర్ పాత్రికేయుడు బుఖారీ హత్యపై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హత్యవార్త తనను విషాదానికి గురిచేసిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ట్వీట్ చేశారు. బీజేపీ నేత రామ్‌మాధవ్ కూడా బుఖారీ హత్యను తీవ్రంగా ఖండించారు.‘రైజింగ్ కాశ్మీర్ ఎడిటర్ ఇన్ చీఫ్ బుఖారీ శ్రీనగర్‌లో చనిపోయారన్న వార్త నన్ను దిగ్భ్రాతికి గురిచేసింది’అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.