జాతీయ వార్తలు

ప్రధానితో గవర్నర్ నరసింహన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రధాని నరేంద్ర మోదీని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో విడివిడిగా సమావేశం అయ్యారు. శుక్రవారం ఉదయం కేంద్ర హోంమంత్రిత్వ కార్యాలయంలో రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు హోంశాఖ ఉన్నత అధికారులను కూడా గవర్నర్ కలిశారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ప్రధానిని ఆయన నివాసంలో గవర్నర్ నరసింహన్ మోదీని కలిశారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తాజా పరిస్థితులను, అలాగే పలు అంశాలు ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రికి గవర్నర్ వివరించారు. గవర్నర్ శనివారం ఢిల్లీ నుండి హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు.

చిత్రం..ఢిల్లీలో శుక్రవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయిన గవర్నర్