జాతీయ వార్తలు

ఎన్నికలకు సిద్ధం కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో 2019లో పార్లమెంట్, శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం పలు మార్గదర్శకాలు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. లక్ష్మీనారాయణ సోమవారం ఆంధ్ర భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు.
రెండు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఏపీలో పార్టీ పరిస్థితి, రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి, తదితర అంశాలను ఈ నెల 20న బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో చర్చించి అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్‌తో రెండేళ్లుగా తెలుగుదేశం అంటకాగుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తన చేతుల్లోకి లాక్కొని ఆయన ఆశయాలకు వెన్నుపోటు పోడిచారని కన్నా ధ్వజమెత్తారు. టీడీపీ ఓ డ్రామా కంపెనీగా మారిందని బీజేపీ నేత ఎద్దేవా చేశారు. వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని దూషించి ఇప్పుడు ఆ పార్టీతో చేతులు కలపడం పచ్చి అవకాశవాదమని విమర్శించారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటించి ‘ఇంటింటికి బీజేపీ’ని తీసుకెళ్తామని చెప్పారు. విలేఖరుల సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..న్యూఢిల్లీలో సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ ఏపీ నేత కన్నా లక్ష్మీనారాయణ