జాతీయ వార్తలు

అభివృద్ధిని ప్రజలకు వివరించండి: అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, సెప్టెంబర్ 17: భారత మాతను కమలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రచారాన్ని సాగించాల్సిందిగా బీజేపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సూచించారు. వీటిపై మీకు విశ్వాసం ఉందా లేదా? అని కాంగ్రెస్ నాయకులను నిలదీయండని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక్కడి పారిశ్రామిక నగరం బిల్వారాలో సోమవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేవలం ప్రభుత్వ పనితీరుతోనే ఎన్నికల్లో విజయం సాధ్యం కాదని, కార్యకర్తల కృషికూడా అందుకు తోడవ్వాలన్నారు. కేంద్రంలోప్రధాన మంత్రి మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వసుంధర రాజే ద్విగుణీకృత శక్తియుక్తులతో పాలన సాగిస్తున్నారని, ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ఇద్దరు నేతల పనితీరును, సాధించిన అభివృద్ధిని వివరించి చైతన్యవంతం చేయాలని షా సూచించారు. మోదీ ప్రభుత్వ విజయాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.