జాతీయ వార్తలు

రేపటిలోగా విశ్వాసం నిరూపించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, జూలై 14: సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న అరుణాచల్ ప్రదేశ్ సీయం నబం టుకిని జూలై 16లోగా అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలని ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ తథాగత రాయ్ ఆదేశించారు. గవర్నర్ జెపి రాజ్‌ఖోవా వివాదాస్పద జోక్యంతో టుకి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత జనవరిలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే గురువారం కార్యాలయానికి హాజరైన నబమ్ టుకి, ఇంత తక్కువ సమయంలో విశ్వాసపరీక్షను ఎదుర్కోవటం కష్టమని, అందుకే మరికొంత సమయం ఇవ్వాలని తాత్కాలిక గవర్నర్ తథాగతరాయ్‌కి విజ్ఞప్తి చేస్తానని విలేఖరులకు చెప్పారు. గవర్నర్ రాజ్‌ఖోవా సెలవులో ఉండటంతో తథాగతరాయ్ అరుణాచల్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ నబం టుకిని ముఖ్యమంత్రిగా బుధవారం నుంచి తిరిగి నియమిస్తున్నట్లు, 16లోగా విశ్వాసపరీక్షను ఎదుర్కోవాలంటూ గవర్నర్ కార్యాలయం నబం టుకికి సమాచారం ఇచ్చింది.