రాష్ట్రీయం

లక్షన్నర కోసం బంగారు బాబు హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, జూలై 16: పుణెకు చెందిన బంగారు బాబు దత్తా ఫుగెను అతని కుమారుడి స్నేహితులు కేవలం రూ. 1.5లక్షల కోసం హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. బంగారుబాబుగా ఖ్యాతినార్జించిన ఫుగేను గురువారం కత్తులు, రాళ్లు, రాడ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు శుభం ఫుగె(21) ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం అతని అయిదుగురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి విచారణలో నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం గురువారం రాత్రి పది గంటలకు శుభం స్నేహితుడు అతుల్ మోహితే శుభంకు ఫోన్ చేసి ఓ పుట్టినరోజు వేడుకకు దత్త్ఫాగేను తీసుకురమ్మని కోరాడు. అంతే కాదు..అనుమానం రాకుండా ఉండేందుకు వస్తూ వస్తూ 10 బిర్యానీ ప్యాకెట్లు, రెండు సిగరెట్ ప్యాకెట్లు కూడా తీసుకురావాలని శుభంకే పురమాయించాడు. శుభం తన తండ్రికి విషయం చెప్పి కారులో ఆహారాన్ని తీసుకుని రోహన్ పంచాల్ అనే స్నేహితుడి ఇంటికి వెళ్లారు. వాళ్లు అక్కడికి చేరగానే మోహితే, మరికొందరు కలిసి దారుణంగా కారుపైనే దారుణంగా దాడి చేశారు. దత్త్ఫాగే అక్కడికక్కడే మరణించారు. ఈ విషయాన్ని పోలీసులకు శుభం, పంచాల్‌లు తెలియజేయటంతో మోహితే మరో పది మంది ఘటనాస్థలి నుంచి పారిపోయారు. ఆ తరువాత పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.