జాతీయ వార్తలు
ఎవరితోనైనా చర్చలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శ్రీనగర్, అక్టోబర్ 23: కాశ్మీర్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి పాకిస్తాన్ సహా ఎవరితోనైనా చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉందని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఇక్కడ ప్రకటించారు. అయితే ఒకపక్క ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతుంటే చర్చలు కొనసాగవని, ఈ రెంటికీ ఎప్పుడూ పొంతన కుదరదని తేల్చి చెప్పారు. శ్రీనగర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో పాల్గొనాలని అభ్యర్థించారు. ఎంత కఠిన సమస్యనైనా, సవాళ్లనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతామన్నారు. అలాగే కాశ్మీర్కు సంబంధించిన చాలా సమస్యలను ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే నివృతి చేసుకోవచ్చునని అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేని వ్యక్తులు ప్రజల సంక్షేమాన్ని కాంక్షించలేరని ఆయన తెలిపారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అన్ని వర్గాలతోనూ చర్చలు జరపడానికి కేంద్రానికి ఎలాంటి సమస్యా లేదని ఆయన చెప్పారు. అయితే భారతదేశంలో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచిపోషిస్తోందని, అలాగే దీనికి సంబంధించి అన్ని విధాలుగా మద్దతు ఇస్తోందన్న వాస్తవాన్ని మరచిపోకూడదని మంత్రి అన్నారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే పాకిస్తాన్ చర్యలను ఎదుర్కోగలుగుతామన్నారు. వేర్పాటువాదులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు శాంతిసాధనకు ఎవరితోనైనా చర్చిస్తామని రాజ్నాథ్ తెలిపారు. కాగా, ప్రస్తుతం సంఘర్షణలకు స్వస్తి చెప్పేందుకు వీలుగా పాకిస్తాన్తో చర్చలు జరపాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని కేంద్రాన్ని కోరారు. రాజ్నాథ్సింగ్తో జరిపిన చర్చల్లో ఆమె ఈమేరకు అభ్యర్థన చేశారు. రాష్ట్రానికి చెందిన అనేకమంది రాజకీయ నాయకులు రాజ్నాథ్ను కలుసుకోవడంతో పాటు రాష్ట్ర పరిస్థితిపై చర్చించారు. పాకిస్తాన్తో సత్సంబంధాలు కొనసాగితే పరిస్థితిలో గుణాత్మక మార్పు వస్తుందని రాజ్నాథ్కు మెహబూబా స్పష్టం చేసినట్టు పీడీపీ ఒక ప్రకటనలో తెలిపింది.
చిత్రం.. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్తో మంగళవారం సమావేశమైన
కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్ర భద్రతా పరిస్థితిపై చర్చించారు