జాతీయ వార్తలు

మరింత సమయం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: శబరిమల ఆలయంలోకి వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరినీ అనుమతించేందుకు మరింత సమయం కావాలని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం మహిళా భక్తులకు అవసరమైన కనీస ఏర్పాట్లు లేవనీ ఇటీవల సంభవించిన వరదల కారణంగా ఉన్న కొద్దిపాటి సౌకర్యాలకు కూడా నష్టం వాటిల్లిందని, అందువల్ల మహిళా భక్తులను అనుమతించేందుకు మరింత సమయం కావాలని స్పష్టం చేసింది. వయసుతో నిమిత్తం లేకుండా మహిళ లందరికీ స్వామి అయ్యప్ప దర్శన భాగ్యం కలిగించాలని సెప్టెంబర్ 28న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు బెంచి 4:1 మెజారిటీతో తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ కొంతమంది సామాజిక మహిళా కార్యకర్తలు అయ్యప్ప ఆలయాన్ని సందర్శించేందుకు విశ్వప్రయత్నం చేస్తుండగా, అది సాంప్రదాయానికి విరుద్ధమంటూ భక్తులు వారిని అడ్డుకోవడం తెలిసిందే.