జాతీయ వార్తలు

ఎన్నికల్లో పోటీ చేయను: సుష్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: కేంద్ర కేబినెట్‌లో సీనియర్ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని వెల్లడించారు. అధికార బీజేపీలో ఉన్న సీనియర్ మంత్రుల్లో సుష్మా కూడా ఒకరు. ‘పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. నేను మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. దానికి మానసికంగా సిద్ధపడుతున్నాను’ అని కేంద్ర విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె కాసేపు మీడియాతో ముచ్చటించారు. మధ్యప్రదేశ్‌లోని విదీషా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఆరోగ్య కారణాల రీత్య సుష్మా స్వరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మధుమేహంతో బాధపడుతున్న ఆమె 2016 నుంచి అధికార కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. సుష్మాకు కిడ్నీ మార్పిడీ ఆపరేషన్ కూడా జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పలు కీలక శాఖలను ఆమె నిర్వర్తించారు.

చిత్రం..కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్