జాతీయ వార్తలు

బీజేపీని వెంటాడుతున్న ఓటమి భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అనుచరుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ శనివారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్టు గ్రహించి, తీవ్ర స్థాయిలో భయపడుతున్న మోదీ ప్రభుత్వం దురహంకారంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజలను బెదిరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ శనివారం ఇక్కడి ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ భారత్‌లో రాజ్యాంగబద్ధమయిన పాలన మొదలయిన తరువాత ఇలాంటి ‘టెర్రర్ రాజ్’ను ఎన్నడూ చూడలేదని విమర్శించారు. ‘బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మనము పోరాడాం. బీజేపీ పాలనపై కూడా తీర్పు వచ్చిన రోజున దానికి బాగా తెలిసి వస్తుంది’ అని అన్నారు. రాబర్ట్ వాద్రాతో సంబంధం ఉన్న ముగ్గురి ఇళ్లలో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు.