జాతీయ వార్తలు

పార్లమెంట్‌ను అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: వివాదాస్పద అయోధ్య స్థలంలో రామమందిర నిర్మాణంపై మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వం కనుక బిల్లు ప్రవేశపెట్టకపోతే సమావేశాలను సజావుగా జరగనీయబోమని శివసేన హెచ్చరించింది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బిజేపీ మిత్రపక్ష పార్టీ అయిన శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైరే ఈ హెచ్చరికలు జారీచేశారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం హాజరైన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాము ఈ సమావేశాల్లో రామమందిర నిర్మాణంపై ఎన్డీఏ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిని కనుక మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టకపోతే పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటామని ఆయన అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు.