జాతీయ వార్తలు
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 12 December 2018
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల పనితీరును బట్టి వచ్చాయి తప్ప అవి మోదీ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చినవి కాదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ వెలుపల మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వివిధ పార్టీలతో కాంగ్రెస్ ఏర్పర్చుకున్న మహాకూటమికి తెలంగాణలో ఘోర పరాజయం వచ్చిందని, అక్కడ టీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో తిరిగి అధికారాన్ని చేజెక్కించుకున్న విషయం మరువరాదని అన్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించిన పార్టీలు, అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు.