జాతీయ వార్తలు

బాబుకు ఏపీ ప్రజలు కూడా బుద్ధి చెబుతారు: వైఎస్సార్‌సీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తును ప్రజలు తిరష్కరించారని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నారు. ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ .సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ విలేఖరులతో మాట్లాడారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు పరిపక్వతతో మంచి తీర్పు ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు దారి తప్పినా ప్రజలు సరైన విధంగా తీర్పు ఇచ్చారని అన్నారు. మూఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా తగిన బుద్ధి చెబుతారని మేకపాటి జోస్యం చెప్పారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు విన్యాసాలు తెలంగాణలో బెడిసికొట్టాయని అన్నారు. అనైతిక పొత్తువల్ల నష్టపోయామని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు అభిప్రాయపడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో పొత్తులు లేకుండా చంద్రబాబు పోటీ చేయలేరని ఉమ్మారెడ్డి విమర్శించారు. ఇలావుండగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీసీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు.