జాతీయ వార్తలు

టీడీపీ పతనం ప్రారంభమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి పరాభవంతోనే తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమైందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. మంగళవారం ఢిల్లీలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజలు కూడా తిరష్కరించారని వెల్లడించారు. అవినీతికి, అహంకారానికి ఆ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని, తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల తీర్పుతో రుజువైందని అన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో తమ పార్టీ చేసిన కృషికి అశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదని, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పుడు వచ్చిన ఓట్లశాతం కంటే ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్ల శాతం పెరిగిందని చెప్పారు. తెలంగాణలో విజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్టీ అధినేతకు ఆయన అభినందనలు తెలిపారు.