జాతీయ వార్తలు

బోగస్ ఓట్లున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అవకతవకలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు విజయ సాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, శివప్రసాద్, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం విజయ సాయిరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ సర్వేల పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఓట్లు
తొలగించబడిన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఓటర్ల జాబితాలో తప్పులను క్షుణంగా పరిశీలించి సరిదిద్దాలని కోరినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే వ్యక్తి పేరుతో నాలుగైదు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. సుమారు 35 లక్షలకు పైగా నకిలీ ఓట్లు ఆంధ్రాలో ఉన్నాయని ఈసీకి స్పష్టం చేసినట్టు చెప్పారు. సుమారు 18 లక్షల మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండుచోట్లా ఓట్లు ఉన్నాయని వివరించారు. నకిలీ ఓట్లు అరికట్టాలంటే ఓటర్ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. దీనికోసం ప్రజాప్రాతినిథ్య చట్టానికి సవరణలు తీసుకురావాలని, లేదంటే ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓటర్లను నమోదు చేయించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.