జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై ఉక్కు పాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశంలో అంతర్గత భద్రత మెరుగుపడిందని, ఉగ్రవాదం, తీవ్రవాదం కార్యకలాపాలు క్రమేపి తగ్గాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆదివారం ఇక్కడ విజయదివాస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో వామపక్ష తీవ్రవాదం 90 జిల్లాల్లో ఉండేదన్నారు. ఎన్డీఏ సర్కార్ తీసుకున్న కఠిన చర్యల వల్ల 12 జిల్లాలకు తగ్గిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాటుదారులు, మిలిటెన్సీ 80 శాతం తగ్గిందన్నారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చామని ఆయన చెప్పారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం పనిచేస్తున్న బీఎస్‌ఎఫ్ జవాన్లు త్యాగనిరతితో రాజీలేకుండా శత్రువుల చొరబాటును అరికడుతున్నారన్నారు. వారికి స్వేచ్ఛనిచ్చామన్నారు. యువతీ యువకుల్లో జాతీయవాదం పెంపొందించేందుకు మాజీ సైనికులు కృషి చేయాలన్నారు. బ్రిగేడర్ మహ్మద్ ఉస్మాన్, మేజర్ సోమనాథ్ శర్మ లాంటి వీర సైనికులు త్యాగనిరతిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. దేశ భక్తి అంటే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ గుర్తుకు వస్తారన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలను అక్కున చేర్చుకుంటామన్నారు. 1971లో మన సైనికులు చూపిన తెగువ వల్ల బంగ్లాదేశ్ అవతరించిందన్నారు. ప్రపంచ సైన్యాల్లో భారత్ సైన్యం మంచి నైపుణ్యం సాధించిందన్నారు. యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబ సభ్యులకు ఆయన సన్మానం చేశారు. అలాగే వెటరన్స్ ఇండియా అసోసియేషన్ న్యూస్ లెటర్‌ను విడుదల చేశారు.

చిత్రం..విజయ్‌దివాస్ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో
మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబ సభ్యుల్ని సన్మానిస్తున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్