జాతీయ వార్తలు

మళ్లీ వచ్చేది.. మోదీ ప్రభుత్వమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16:వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఆయన సారథ్యంలో దేశ వ్యాప్తంగా కమలం వికసించడం ఖాయమని ఆదివారం ఇక్కడ జరిగిన మహిళా హూంకార్ ర్యాలీలో ఉద్ఘాటించారు. గత నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చేర్చే బృహత్తర బాధ్యతను చేపట్టాలని, అన్ని వర్గాల ప్రజలకు ఈ సందేశాన్ని చాలా బలంగా అందించాలని పిలుపునిచ్చారు. అలాగే మహిళల మద్దతును కూడా విశేషంగా చూరగొనే ప్రయత్నం చేయాలని ఢిల్లీ బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఇరానీ పార్టీ శ్రేణుల్ని కోరారు.
మోదీ సారథ్యంలో మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తామని, అభివృద్ధి,మహిళా సాధికారత విషయంలో మోదీ సాధించిన విజయాలను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేస్తామని తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం దేశ సమగ్ర వికాసానికి, అభివృద్ధికి ఎంతగానో దోహదం చేసిందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పని చేసిందని తెలిపారు. ఆ ప్రభుత్వానే్న 2019 సాధారణ ఎన్నికల్లోనూ మళ్లీ ఎన్నుకునేలా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామన్నారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య ఘటన జరిగి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ హూంకార్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ సహా పలువురు పార్టీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తివారీ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆప్ ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోయిందని, గతంలో చెప్పినట్టుగా బస్సుల్లో మహిళల రక్షణ కోసం మార్షల్‌ను నియమించడంలోనూ విఫలమైందన్నారు.

చిత్రం..ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన హుంకర్ ర్యాలీలో
కేంద్రమంత్రి సృతిఇరానీ, బీజేపీ మహిళా ప్రతినిధులు నినాదాలు చేస్తున్న దృశ్యం