జాతీయ వార్తలు

సామాజిక న్యాయానికి అవరోధాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోలాపూర్: సామాజిక న్యాయం సాధనలో భాగంగా జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిందని, అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రతిసంక్షేమాన్ని, అన్ని వర్గాలకు మేలు చేసే ప్రభుత్వ లక్ష్యాలను నీరుకార్చడమే ధ్యేయంగా పనిపెట్టుకుని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్‌కు అలవాటైందన్నారు. రాఫెల్ ఫైటర్ జెట్స్‌పై కాంగ్రెస్ కేంద్రంపై అపనిందలను ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే విధానాలపై అభూతకల్పనలను సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటైందన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన బ్రహ్మాండమైన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ దుర్నీతిని ఎండగడుతూ లోక్‌సభ సరైన సమాధానాన్ని ఇచ్చిందన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ల వల్ల బీసీలు, దళితులు, గిరిజనుల ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగదని ఆయన చెప్పారు. లోక్‌సభలో పౌరసత్వ చట్టంకు సవరణలు తెచ్చే బిల్లుకు ఆమోదం లభించిందన్నారు. దీని వల్ల ఈశాన్య రాష్ట్రాలతో దేశంలో స్థిరపడిన ముస్లింయేతరులకు న్యాయం జరుగుతుందన్నారు. వీరంతా ఇరుగుపొరుగు దేశాల్లో హక్కులను కోల్పోయి శరణార్థులుగా భారత్‌కు వచ్చారన్నారు. అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదన్నారు.
ఆగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కేసులో నిందితుడు మిచిల్ రాఫెల్ తయారీదారులను వ్యతిరేకించే వర్గాలను కూడా సంప్రదించడానికి కారణమేంటని, దీని వెనక ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. మన దేశంలో యూపీఏ హయాంలో దళారుల వ్యవస్థ ఆడిందే ఆటగా సాగిందన్నారు. మిచిల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అనేక దిగ్భ్రాంతి కలిగించే అంశాలను వెల్లడించారన్నారు. అన్ని రకాల రక్షణ రంగ ఉత్పత్తుల కొనుగోళ్లలో గత ప్రభుత్వ హయాంలో మిచిల్ దళారీగా పనిచేశారన్నారు. దేశంలో అవినీతి నిర్మూలనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ‘ మోదీని ఎవరు భయపెట్టలేరు. ఖర్చుపెట్టిన ప్రతి ప్రభుత్వ పైసాకు లెక్కచెప్పగలం. ఈ చౌకీదార్ నిద్రపోరు. తప్పులు చేసిన వారిని ప్రజా కోర్టులో ఎండగడుతాం. నన్ను నిరంతరం ద్వేషిస్తూ దుష్ప్రచారం చేస్తారు. కని నేను ఎవరికీ లొంగను. అవినీతిని పారద్రోలేదాకా విశ్రమించను’ అని మోదీ అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పుట్టినిల్లన్నారు. ఈ రాజకీయాల ద్వారా దేశ సమగ్రతకు దెబ్బ అన్నారు. గత నాలుగున్నరేళ్లలో ఎన్డీఏ సర్కార్ చేపట్టిన అనేక ప్రాజెక్టులను ఆయన వివరించారు. జాతీయ రహదారులు, విద్యుత్ ప్రాజెక్టుల గురించి ఆయన పేర్కొన్నారు. అందరికీ ఇల్లు నినాదాన్ని అమలు చేసి చూపిస్తున్నామన్నారు.
చిత్రం..సోలాపూర్‌లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపికను అందచేస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. సోలాపూర్-తుల్జాపూర్-ఉస్మానాబాద్ సెక్షన్ వరకు కొత్తగా నిర్మించిన జాతీయ రహదారి (ఎన్‌హెచ్) 52ను ఈ కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు.