జాతీయ వార్తలు

ప్రధాని, హోంమంత్రితో గవర్నర్ నరసింహన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో విడివిడిగా చర్చలు జరిపారు. నరసింహన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ప్రధాన మంత్రికి వివరించినట్లు తెలిసింది. దాదాపు అరగంటపాటు కొనసాగిన ఈ సమావేశంలో నరసింహన్ రాజకీయ స్థితిగతులతోపాటు శాంతిభద్రతలు, ఇతర అంశాల గురించి కూడా వివరించారని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరసింహన్ ప్రధాన మంత్రి, హోం మంత్రితో సమావేశం కావటం ప్రాధాన్యతను సంతరించుకున్నది.