జాతీయ వార్తలు

వైభవంగా అర్థకుంభమేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, జనవరి 17: ప్రయాగ్‌రాజ్ అర్థ కుంభమేళా వైభవంగా సాగుతోంది. దేశం నలుమూలల నుంచి యాత్రికులు తరలివస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సవితా కోవింద్ గురువారం త్రివేణి సంగంలో జరిగిన గంగా పూజల్లో పాల్గొన్నారు. ఉదయం 9.30 గంటలకు భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి దంపతులు బామ్‌రౌలీ విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ రాంనాయక్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు రాష్టప్రతికి ఘన స్వాగత పలికారు. రామ్‌నాథ్ కోవింద్, సవితా కోవింద్ ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం తదిరులు వెంట ఉన్నారు. త్రివేణి సంగమం వద్ద రాష్ట్రపతి దంపతులు అర్థగంట సేపు గడిపారు. సాయంత్రం ఢిల్లీ బయలుదేరే ముందు సాధువులతో రాష్ట్రపతి భేటీ అయ్యారు. మాఘమేళకు రాష్ట్రపతి కోవింద్ కుటుంబ సభ్యులు రెండేళ్లుగా వస్తున్నారు.
చిత్రం..గురువారం త్రివేణి సంగమంలో జరిగిన గంగా పూజల్లో పాల్గొన రాష్ట్రపతి కోవింద్