జాతీయ వార్తలు

ఇదీ.. మా రాజకీయ చిత్తశుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లను విద్య, ఉద్యోగాల్లో కల్పించేందుకు నిర్దేశించిన బిల్లుకు రాజ్యాంగ సవరణను రాజకీయ సంకల్పం వల్లనే సాధ్యమైందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలిపారు. బలమైన రాజకీయ సంకల్పం వల్లనే ఇంతటి గొప్ప బిల్లును పార్లమెంటులో ఆమోదించుకున్నామన్నారు.
రాజ్యాంగ సవరణతో పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ చట్టాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తామన్నారు. గురువారం ఇక్కడ ఆయన సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ 1500 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్న సామాజిక వర్గాల రిజర్వేషన్లకు విఘాతం కలగకుండా ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్లను కల్పించామన్నారు. ఈబీసీ రిజర్వేషన్లను ఈ ఏడాది దేశంలో 900 విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న 40వేల కాలేజీల్లో అమలు చేస్తామన్నారు. అలాగే సీట్లను పదిశాతం పెంచుతున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలకు సమానంగా రిజర్వేషన్ల ఫలాలు అందిస్తామన్నారు. సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఆసుపత్రిలో ఆరోగ్యబీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. వంద రోజుల్లో దేశంలో ఏడు లక్షల మందికి ఆరోగ్య బీమా ఫలాలను అందించినట్లు చెప్పారు. హెలిపాడ్ సదుపాయం ఉన్న తొలి ఆసుపత్రి ఇదేనని ఆయన అన్నారు. పరిశుభ్రత, హెల్త్‌కేర్ అనే రెండు లక్ష్యాలతో అహ్మదాబాద్ నగరపాలక సంస్థ మొదటి నుంచి పనిచేస్తోందన్నారు. 2012 లో ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. దేశంలో నాలుగున్నరేళ్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించామని ప్రధాని మోదీ చెప్పారు. ఇక్కడ షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యాటక రంగం, తయారీ రంగం, సేవా రంగంలో మంచి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. దేశంలో 2017లో ప్రవేశపెట్టిన వస్తుసేవా పన్ను వల్ల మంచి ఆదాయం వస్తోందన్నారు.
పరోక్ష పన్నుల విధానంలో కూడా సంస్కరణలు తేనున్నట్లు చెప్పారు. ఇక్కడ ఇస్రో వ్యవస్థాపక చైర్మన్ విక్రమ్ సారాభాయ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
చిత్రం..అహ్మదాబాద్‌లో గురువారం సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ 1500 పడకల ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ