జాతీయ వార్తలు

పులకించిన గంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, జనవరి 21: పవిత్ర గంగానది భక్తుల తాకిడితో సోమవారం కిటకిటలాడింది. గజగజలాడించే చలిలోనూ కోటి మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పౌష పూర్ణిమ కావడంతో అర్థకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆదివారం రాత్రి నుంచే భక్తుల రాకపోకలు మొదలయ్యాయి. త్రివేణి సంగమం ప్రాంతంలో ఇసుకవేస్తే రాలనంత జనం కనిపించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఘాట్‌లలో ఎక్కడా తొక్కిసలాటలు, అపశ్రుతులు చోటుచేసుకోకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామునే కాకుండా బాగా వెలుతురు వచ్చాక కూడా పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులు ఘాట్‌లోనే ఉండడం కనిపించింది.